Pages

24, నవంబర్ 2020, మంగళవారం

మాట గదరా శివ... పాట గదరా శివ

                                     

అందరికి  నమస్కారం  .... 

                                   ఓం నమఃశ్శివాయ.. ఇదే పంచాక్షరీమహా మంత్రం. 

ఈ మంత్రం యజుర్వేదం రుద్రాధ్యాయం లోనిది. అన్ని కోర్కెలనూ నెరవేర్చే కల్పవృక్షం ఈ మంత్రం. దీని ఉచ్చరణ వల్ల చిత్తశుద్ధి, జ్ఞానప్రాప్తి లభిస్తాయని పురాణాల్లో తెలిపారు. ఈ మంత్రంలో ‘ఓం’తో సహా ఆరు అక్షరాలున్నాయి. ప్రతి మంత్రానికి ముందు ఓం ఉంటుంది. కాబట్టి, దాన్ని వదిలేసి లెక్కిస్తే ఐదక్షరాలే. అలా అని ఓంకారాన్ని వదలరాదు.

‘న, మ, శి, వ, య. మంత్రం’ ‘ఓం’ కారంతో ప్రారంభం అవుతుంది. ఓం... మహాబీజాక్షరం. దీని నుంచే మిగిలిన అక్షరాలన్నీ ఆవిర్భవించాయని చెబుతారు. ఈ మంత్రంలో ఉన్న అక్షరాలకు ‘అర్థం, పరమార్థం’ రెండూ ఉన్నాయి.


 శ్లో    ఓంకారంచ పరబ్రహ్మ యావదొంకార సంభవః|                                                                                            అకారోకారమాకార ఏతే సంగీత సంభవాః ||    

   ఓంకారము పరబ్రహ్మ  స్వరూపము . ఆ  ఓంకారమునందు   యావత్తు జగము పుట్టెను. అందులో అకార, ఉకార, మకారము లనే మూడక్షరముల వలన సంగీతం పుట్టెనని భావము

శ్లో    అకారో విష్ణ రూపంచ ఉకారో బ్రహ్మ రూపకం ||

     మకారో భర్గ రూపంచ సర్వ మోంకార రూపకం ||   

 అకారము విష్ణు స్వరూపము ,ఉకారము బ్రహ్మ స్వరూపము ,మకారము రుద్ర స్వరూపము   .ఈ త్రిమూర్తుల స్వరూపమే ఓంకారం


               ఈ మంత్రం ఆధ్యాత్మికతకు ఉపయోగపడుతుందని, ఈ మంత్రోచ్చారణ వల్ల నాడులు పరిశుభ్రమై, మనసులో ప్రశాంతత నెలకుంటుందని పండితులు చెబుతారు. దీనిని పదేపదే ఉచ్చరించడం వల్ల మనిషిలో ఉండే తమో, రజోగుణం పోయి ఆధ్యాత్మిక భావన పెరుగుతుందని కూడా ఆధ్యాత్మికవేత్తలు బోధిస్తున్నారు.

            ఈ మంత్రం వెనుక ఎంతో పరమార్థం ఉంది. మానవ శరీరం పంచభూతాత్మకం. నమశ్శివాయ అనే అయిదు అక్షరాలను పలికినప్పుడు పంచ భూతాలతో నిండిన శరీరం శుభ్రమవుతుంది. ఒక్కో అక్షరం ఒక్కో భూతాన్ని శుభ్రం చేస్తుంది.

‘న’ భూమికి సంబంధించిన భాగాలను,

‘మ’ నీటికి సంబంధించిన భాగాలను, 

‘శి’ అగ్నికి సంబంధించిన భాగాలను,

‘వ’ గాలికి సంబంధించిన భాగాలను, 

‘య’ ఆకాశానికి సంబంధించిన భాగాలను పరిశుభ్రం చేస్తాయి.

              మనసు, శరీరం పరిశుభ్రంగా లేనంతవరకు మనిషిలో ఆధ్యాత్మిక భావన స్వచ్ఛంగా నిలబడదు. అందువల్లే ఓం నమశ్శివాయ అనే పదాన్ని పదేపదే ఉచ్చరిస్తే, మానసిక ప్రశాంతత ఏర్పడుతుందనడంలో ఏ మాత్రం సందేహం అక్కర్లేదని పౌరాణికులు చెబుతారు.

                    నమశివాయలు పాట

              మన పెద్దవాళ్ళు ఏ విషయాన్ని  అయినా  ఒక పద్యం రూపంలో  కానీ ఒక పాట రూపంలో కానీ చెప్పేవారు ..  అలా మా పెద్ద మేనత్త దగ్గర నేను నేర్చుకున్న ఒక పాట  నమశ్శివాయ లు

 ఈ పాట ఎవరు రాశారు నాకు తెలియదు  కానీ దీనిలో చాలా గొప్ప అర్ధం ఉంది దానిని మీ కోసం ఈ క్రింద రాస్తున్నా


.                   కాశీలో విశ్వేశ్వర మా జనని అన్నపూర్ణాదేవి తో 

          కలభైరవ ఈశ్వర జీవులను కరుణించు    

           || నమశివాయ||

 .                 గంగ యమున నడుమను సరస్వతి సంగమ యుండగాను 

.               నాసిక త్రివేణి లో నాణ్యము గా చూడుము                   || నమశివాయ||

 

 జనన మరణములన గా ఈ జన్మలో పుట్టించొచ్చు చందురు 

 మీ నామ పంచాక్షరి స్థిరముగా నిలుపు మీ         || నమశివాయ||


 కుక్క వలే తిరుగుతూ చాడీలు చక్కగా చెప్పుచుందురు 

 ఒకవేళ ఉన్న బుద్ధి ఒకవేళ ఉండదు                 || నమశివాయ||


 గంతలు  తొమ్మిది ఆలోపల దంతాలు వేయి ఉండును

పంచ క్రోధముల బట్టి నీ యందు పసలేదు       || నమశివాయ||


 మలమూత్రములు గుంటలు ఆ లోపల మాంసపు  నెత్తురు కండలు

 మురికి ప్రేగుల దండతో పైతోలు బహు తీపి      || నమశివాయ||


 వేదములు చదివిన ఎన్నెన్ని వేషాలు వేసినా

 నీ భక్తి లేని వారు కాశీలో కొరగారు                      || నమశివాయ||


 కామ క్రోధములు లకే మానవులు కాలమంతయు గడుపుచూ 

 మోహజ్వాలములగుచూ  మీకంటే వెలలేదు      || నమశివాయ||


పగలు నాలుగు ఝూములు  పోకిరీలు పోవుచు తిరుగుచుందురు 

 రాత్రి పొద్దు వేళ నా అతి కేలి భోగములు అనుభవిస్తారు 

 ఆమీద కను నిద్రతో మిమ్మలను తలువరు         || నమశివాయ||

 

 పెక్కు మాటలాడుతూ పెద్దలను వింతగా దూషించు 

 సజ్జలు చూచి నవ్వి చప్పట్లు తలువారు         || నమశివాయ||

 

 ఈశ్వరా నీ నామము యిలలోన ఎవరూ పాడి వినను

 కైవల్యము తో ముక్తి పొందుతారు             || నమశివాయ||


                                              లోక సమస్త సుఖినో భవంతు

**** మీ ఉషగిరిధర్ ***********


2 కామెంట్‌లు:

  1. చాలా తెలియని విషయాలు చెప్పావు ఉషా. ధన్యవాదాలు. ఆ పాట పాడి ఆడియో పెట్టాల్సింది ఉషా.

    రిప్లయితొలగించండి
  2. మీ పెద్దత్త కూతురు తరపున కూడా ధన్యవాదాలు ఉషా.

    రిప్లయితొలగించండి