Pages

2, ఫిబ్రవరి 2021, మంగళవారం

ఎందరో మహానుభావులు అందరికి వందనములు 🙏🙏

 ఎందరో మహానుభావులు అందరికి వందనములు  
ఈ  మధురమైన కీర్తన తెలియని మానవుడు !
అనేవాడు ఉండడే మో ? బహుశ : ! 

తెలుగు వాగ్గేయకార త్రయంలో ధాతు , మాతువులకు ప్రాధాన్యత నిచ్చి ,
రచన చేయడంలో దిట్ట ,స్వర రాగ బ్రహ్మ "త్యాగ రాజు."

అలాంటి !కమనీయమైన కవిత !పరిపూర్ణమైన భక్తి ! సరస సంగీతం !ఈ మూడూ త్రివేణి గా తన గాన సుధా మధు రసాన్ని,ప్రవహింప చేశాడు "నాదబ్రహ్మ త్యాగయ్య."  

ఎన్నో భక్తిపరమైన కృతులను రచించి, దాక్షిణాత్య కర్నాటక సంగీతానికి తెలుగును సంగీత భాషగా తీర్చిదిద్దిన మహనీయుడు త్యాగయ్య. 

స్వర సాహిత్య సమ్మేళనం అద్భుతంగా సృష్టించిన ఆయన.
తమిళదేశంలో పుట్టి పెరిగినా త్యాగయ్య తెలుగువాడు. 

ఆయన పలికినది తెలుగు పలుకు. "పలుకువేమి నా దైవమా రామ!" - అంటూ, అచ్చ తెలుగులో ఆత్మనివేదన చేసుకున్న త్యాగయ్య తెలుగుకు సంగీత సుభగత్వం సమకూర్చిన మహనీయుడు.

నాట, వరాళి, గౌళ, అరభి, శ్రీరాగాలలో గల పంచరత్నాలు-నాటికీ, నేటికీ, రేపటికీ ఇది పంచరత్నాలే.   

తెలుగు భాషా సుమ సుగంధాలు జగద్వ్యాప్తం కావడానికి నాదసుధారస ధారలు కురిపించిన శ్రీ త్యాగరాజ స్వామి కీర్తనలు తెలుగు వారి పుణ్యఫలాలుగా చెప్పుకోవచ్చు.

ఆయన భక్తిరసం జగదానందకారుకుడు, జానకీప్రాణనాయకుడు, కరుణారససింధువైన రామచంద్రునిలో ఐక్యమైంది.   ఆ రోజు... ఈ రోజు ...పుష్య బహుళ పంచమి...(2/2/2021)

నాటి నుండి నేటి వరకూ అజరామరంగా ఆయన రచించి ఆలపించిన ఘనరాగ పంచరత్న కీర్తనలు దశదిశలా, వాడవాడలా మారుమోగుతూనే వున్నాయి. 

ప్రత్యేకంగా ఆరాధనోత్సవాలలో తిరువాయూరులోని ఆయన సమాధి వద్ద గాత్ర, వివిధ వాద్య సంగీత విద్వాంసులు కీర్తిస్తూ... స్తుతిస్తూ... ఆయన పంచరత్నాలను ఆలపిస్తూ, పంచరత్నసేవతో ఘనంగా నివాళులర్పిస్తూ నే వున్నారు. 

సూర్యచంద్రులు వున్నంతవరకూ ఆయన కీర్తనలు వినిపిస్తూనే వున్నాయి... వుంటాయి కూడా. 

సంగీతాకాశంలో నిండు జాబిల్లిలా ప్రకాశించిన త్యాగయ్య ఆ సంగీతం వినబడినంతకాలం చిరంజీవియే!🙏🙏

    


పల్లవి

ఎందరో మహానుభావులు అందరీకి వందనములు ॥ఎందరో॥

అనుపల్లవి

చందురు వర్ణుని అందచందమును హృదయార

విందమున జూచి బ్రహ్మానంద మనుభవించువా ॥రెందరో॥

సామగానలోల మనసిజ లావణ్య ధన్యమూర్దన్యు

మానసవనచర వరసంచారము నిలిపి మూర్తి బాగుగా పొగడనేవా ॥రెందరో॥

సరగుస బాదములకు స్వాంతమను

సరోజమును సమర్పణము సేయువా ॥రెందరో॥

పతితపావనుడనే పరాత్పరు గురించి

బరమార్థమగు నిజమార్గముతోను బాడుచును,

సల్లాపముతో స్వరలయాది రాగముల తెలియువా ॥రెందరో॥

హరి గుణమణులగు సరములు గళమున

శోభిల్లు భక్తకోటు లిలలో తెలివితో చెలిమితో

గరుణగల్గి జగమెల్లను సుధాదృష్టిచే బ్రోచువా ॥రెందరో॥

హోయలుమీఱ నడులుగల్గు సరసుని సదా

గనుల జూచుచును, పులకశరీరులయి ముదంబునను యశముగలవా

పయోధి నిమగ్నులయి ముదంబునను యశముగలవా ॥రెందరో॥

ప్రేమ ముప్పిరిగొను వేళ నామమును దలచేవారు

రామభక్తుడైన త్యాగరాజ సుతునికి నిజరామ ॥రెందరో॥


     



            🙏🙏🙏ఎందరో మహానుభావులు అందరికి వందనములు 🙏🙏🙏

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి