Pages

15, ఏప్రిల్ 2021, గురువారం

బాలానాం రోదనం బలం

 

ఈ మధ్య అందరూ మిడి మిడి జ్ఞానం ఉన్న పండితులే అయిపొయారండీ . ,
మీరు మాటవరసకు 'జలుబు చేసింది, ' అన్నా సరే,
వంద చిట్కాలు, ఉపాయాలు చెప్పెస్తారు.
అటువంటి ఒక పండిత పుత్రుడు ఏమి చేసాడో ఈ కధ చెప్తోంది . 


"పద్మనాభానికి తానొక గొప్ప పండితుడినని నమ్మకం ."

అక్కడా ఇక్కడా గాలివాటుగా విన్న విషయాలు వల్లే వేస్తూ,
ఆచరణలో పెట్టేస్తూ అందరినీ ఇబ్బంది పెట్టేస్తుంటాడు . 

ఒక రోజు పద్మనాభం పొరుగింటి వాడయిన చెంచయ్యకు
పొద్దుటే పిల్లల ఏడుపులు వినబడ్డాయి . 

ఏమయ్యిందో అని వెళ్లి చుస్తే ,
నిద్రపోతున్న పిల్లలను ఒక్కక్కరినే లేపి,
నడ్డి మీద నాలుగు దేబ్బలేసి ఏడిపిస్తున్నాడు పద్మనాభం .

కారణం అడగ్గా,
'బాలానాం రోదనం బలం ' అన్నారు కదా, అందుకే కొడుతున్నా , అన్నాడు . .

'ఆహా, ఏమి పాండిత్యమయ్యా నీది,
ఆ వాక్యానికి అర్ధం అది కాదు,
పూర్తీ శ్లోకం విను,' అంటూ ఇలా వివరించాడు . 


"పక్షీణాం  బలమాకాశం 

మత్స్యానా ముదకం బలం 

దుర్బలస్య బలం రాజా 

బాలానాం రోదనం బలం "


ఎవరికేది బలమో ఈ శ్లోకం చెబుతోంది . 

ఆకాశమే పక్షులకు బలం . ఆపద వస్తే ఆకాశంలోకి యెగిరి తప్పించుకుంటాయి . 

అలాగే చేపలకు నీళ్ళు బలం . 

బలహీనులను రక్షించడం రాజ ధర్మం కనుక బలహీనులయిన ప్రజలకు రాజే బలం . 

చిన్నపిల్లలు తమకు కావలసినవన్నీ ఏడ్చి సాధిస్తారు . ఏడుపే వాళ్ళ ఆయుధం . 

ఎంతటి కర్కోటకుడయినా పిల్లల ఏడుపుకి లొంగిపోతాడు కనుక ,
 అదే వాళ్లకు శక్తి అన్న అర్ధంలో చెప్పిన శ్లోకం ఇది . 

అంతే  కాని, ఏడిస్తే పిల్లలకు బలం వస్తుందని కాదు . 

పిల్లల ఏడుపుకు లొంగిపోయి వాళ్ళను గారం చేసి చెడగొట్ట వద్దు
అని పెద్దలకు చేసిన హితవు,
అంతర్లీనంగా ఇందులో దాగి ఉంది,
అని వివరించాడు చెంచయ్య . మీకూ  తెలిసింది కదూ... 






కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి